చల్లటి కబురు.. తెలంగాణలో రేపటి నుంచి వర్షాలు
- రాష్ట్రంలో కొన్ని రోజులుగా విపరీతమైన ఎండ, ఉక్కపోత
- రేపటి నుంచి ఆరు రోజులు వర్షాలు కురుస్తాయని అంచనా
- ఎల్లో హెచ్చరిక జారీ చేసిన వాతావరణ శాఖ
ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురవొచ్చని తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో ఎండలు విపరీతంగా పెరిగాయి. శనివారం అత్యధికంగా హుజూర్ నగర్ లో 46.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చాలా జిల్లాల్లో 44 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది.