వడివడిగా తరలివస్తున్న రుతుపవనాలు
- శుక్రవారం నాటికి నికోబార్ దీవులకు చేరిన రుతుపవనాలు
- జూన్ 4న కేరళను తాకే అవకాశం
- తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా ఆవరించిన ద్రోణి
- ఫలితంగా, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో వర్షాలు
- కొనసాగుతున్న ఎండలు, నల్గొండ జిల్లా దామచర్లల్లో 45.5 డిగ్రీల సెల్సీయస్ గరిష్ఠ ఉష్ణోగ్రత
శుక్రవారం రాష్ట్రం భానుడి భగభగలతో అట్టుడికింది. నల్గొండ జిల్లా దామచర్లలో అత్యధికంగా 45.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కరీంనగర్ జిల్లా వీణవంకలో 45.4 , నిర్మల్ జిల్లా కడెం పెద్దూరులో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల, సూర్యాపేట, రాజన్న సిరిసిల్ల తదితర ప్రాంతాల్లో 44 నుంచి 44.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి .