Chennai: రూ.535 కోట్లతో నడిరోడ్డుపై నిలిచిపోయిన ట్రక్

  • చెన్నైలో తాజాగా వెలుగు చూసిన ఘటన
  • రిజర్వ్ బ్యాంకు నుంచి రోడ్డు మార్గంలో నగదు తరలింపు 
  • డబ్బు విషయం తెలిసి భారీగా తరలివచ్చిన స్థానికులు
  • ట్రక్‌కు భారీగా భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు
Truck carrying rs 535 crores of rbi struck in chennai due to break down

వందల కోట్ల నగదును తరలిస్తున్న ఓ ట్రక్‌ బ్రేక్‌డౌన్ కావడంతో నడిరోడ్డుపై నిలిచిపోయింది. తాజాగా చెన్నైలో ఈ ఘటన జరిగింది. రిజ్వర్ బ్యాంక్ నుంచి రూ. 535 కోట్లను రోడ్డు మార్గంలో విల్లుపురానికి తరలిస్తుండగా ట్రక్ అకస్మాత్తుగా ఆగిపోయింది. 

ట్రక్‌లో నగదు ఉన్నట్టు తెలుసుకుని ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడటంతో పోలీసులు ఘటన స్థలంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

More Telugu News