భారత్లో 2 వేల మార్కు దిగువకు కరోనా కేసులు
- గత 24 గంటల్లో కొత్తగా 1,839 కరోనా కేసులు
- మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 25,178
- దేశవ్యాప్తంగా సగటు రికవరీ రేటు 98.75 శాతం
ప్రభుత్వ లెక్కల ప్రకారం.. కరోనా సంక్షోభం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.49 కోట్లు కాగా, 5.31 లక్షల మంది ఈ మహమ్మారికి బలయ్యారు. ఇక కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.44 కోట్లుగా ఉంది. ఇప్పటివరకూ దేశంలో 220.66 కోట్ల కరోనా డోసులు పంపిణీ చేశారు.