Employees: ఉద్యోగులకు, పెన్షనర్లకు ఏపీ సర్కారు తీపి కబురు

  • గతేడాది జనవరి 1 నుంచి పెండింగ్ లో డీఏ
  • డీఏ మంజూరు చేస్తూ నేడు ఉత్తర్వులు
  • ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏపై వేర్వేరు జీవోల విడుదల 
  • జులై 1 నుంచి జీతంతో కలిపి డీఏ
AP Govt decides to grant DA for employees and pensioners

ఉద్యోగులు, పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2022 జనవరి 1 నుంచి పెండింగ్ లో ఉన్న డీఏను మంజూరు చేస్తున్నట్టు నేడు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రెండు జీవోలు విడుదల చేసింది. ఉద్యోగులకు డీఏ మంజూరు చేస్తూ జీవో నెం.66... పెన్షనర్లకు డీఏ మంజూరు చేస్తూ జీవో నెం.67 తీసుకువచ్చారు. 

ఈ డీఏను ఈ ఏడాది జులై 1 నుంచి జీతంతో కలిపి ఇవ్వనున్నారు. డీఏ బకాయిలను ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు సమాన వాయిదాలలో చెల్లిస్తారని తెలుస్తోంది. కాగా, తాజా డీఏతో కలిపి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ శాతం 22.75కి పెరుగుతుంది.

More Telugu News