Talasani: కిషన్ రెడ్డికి సవాల్ విసిరిన తలసాని శ్రీనివాస్ యాదవ్

  • అంబర్ పేట నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు రావాలన్న తలసాని
  • నియోజకవర్గానికి కిషన్ రెడ్డి చేసిందేమీ లేదని విమర్శ
  • కేసీఆర్ కంటే గొప్ప హిందువు ఎవరూ లేరని కితాబు
Talasani challenge to Kishan Reddy

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి దమ్ముంటే అంబర్ పేట నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై వారం రోజుల్లో చర్చకు రావాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సవాల్ చేశారు. అంబర్ పేట నియోజకవర్గానికి కిషన్ రెడ్డి 20 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారని... అయినా, ఇంతవరకు నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు. కిషన్ రెడ్డితో చర్చకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బీజేపీ నేతలు కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే గొప్ప హిందువు ఎవరూ లేరని అన్నారు. యాదాద్రి వంటి గొప్ప ఆలయ నిర్మాణం, అనేక ఆలయాల అభివృద్ధి కేసీఆర్ కే సాధ్యమయిందని చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 24 గంటల విద్యుత్ సరఫరా కొనసాగుతోందని అన్నారు. రాష్ట్రంలో తాగునీటి సమస్య లేకుండా చేశారని చెప్పారు.

More Telugu News