కేసీఆర్ దళిత ద్రోహి.. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే నైతికత ఆయనకు లేదు: బండి సంజయ్
- అంబేద్కర్ వర్ధంతి, జయంతి కార్యక్రమాలకు కేసీఆర్ ఎందుకు రావడం లేదన్న సంజయ్
- ఎన్నికల కోసమే అంబేద్కర్ విగ్రహం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శ
- దేశ విభజనను అంబేద్కర్ వ్యతిరేకించారన్న సంజయ్
త్వరలోనే ఎన్నికలు ఉన్నాయి కాబట్టే అంబేద్కర్ విగ్రహం పేరుతో రాజకీయాలకు తెరతీశారని విమర్శించారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కూడా పీవీ నరసింహారావు విషయంలో ఇలానే చేశారని మండిపడ్డారు. హడావుడి అంతా పూర్తయిన తర్వాత పీవీని పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఆర్టికల్ 370ని, దేశ విభజనను వ్యతిరేకించిన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ ను కాంగ్రెస్ అడుగడుగునా అవమానించిందని, ఆయనను ఓడించిందని చెప్పారు. దేశ విభజనను అంబేద్కర్ వ్యతిరేకించారని అన్నారు. మోదీ పాలనలో పథకాలు దళితులకు అందుతున్నాయని చెప్పారు.