ఏపీ సీఎస్కు జేఏసీ మలిదశ ఉద్యమ కార్యాచరణ నోటీసు
- ఉద్యమ కార్యాచరణ నోటీసు ఇచ్చామన్న జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు
- ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం చేస్తున్నామని వ్యాఖ్య
- సకాలంలో జీతాలు అందక ఉద్యోగుల కుటుంబాల్లో ఆందోళన నెలకొందని వెల్లడి
- ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన
సకాలంలో జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన చెప్పారు. టైంకి జీతాలు అందకపోతే ఉద్యోగుల కుటుంబాలు ఆందోళనలో కూరుకుపోతాయని తెలిపారు. ఈఎమ్ఐలు చెల్లించని కారణంగా బ్యాంకులు వడ్డీలు వేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు రాక ఉద్యోగులు లోన్ యాప్స్లో రుణాలు తీసుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. జీతాలు పెరిగితే సంతోషించాల్సిన స్థితి నుంచి జీతాలు అందితే చాలు అన్న స్థితికి ఉద్యోగులను తెచ్చారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నించారు.