ఫేక్ సర్టిఫికెట్లు ఉన్న ఈ ఇద్దరు తెలంగాణ బీజేపీ ఎంపీలపై అనర్హత వేటు వేయగలరా?: కేటీఆర్
- బీజేపీలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ టైపులో చాలా మందే ఉన్నట్టున్నారన్న కేటీఆర్
- ఇద్దరు టీఎస్ బీజేపీ ఎంపీలవి ఫేక్ సర్టిఫికెట్లు అని ఆరోపణ
- అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇవ్వడం నేరం కాదా? అని ప్రశ్న
బీజేపీలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ టైపు వ్యక్తులు చాలా మందే ఉన్నట్టున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణకు చెందిన ఇద్దరు బీజేపీ ఎంపీలవి ఫేక్ సర్టిఫికెట్లని చెప్పారు. రాజస్థాన్, తమిళనాడు యూనివర్శిటీల్లో చదివినట్టు వారి వద్ద తప్పుడు సర్టిఫికెట్లు ఉన్నాయని ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం నేరం కాదా? అని ప్రశ్నించారు. లోక్ సభ స్పీకర్ వీటిని పరిశీలించి ఆ ఇద్దరు ఎంపీలపై అనర్హత వేటు వేయగలరా? అని ప్రశ్నించారు.