ఉద్యోగ అభ్యర్థులు ప్రతిపక్షాల వలలో పడి సమయం వృథా చేసుకోవద్దు: హరీశ్ రావు
- ఇటీవల టీఎస్ పీఎస్సీలో పేపర్ లీక్
- పేపర్ లీక్ దురదృష్టకరమన్న హరీశ్ రావు
- విపక్షాలను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టేనని వెల్లడి
ప్రతిపక్షాలు చెప్పే మాటల్లో ఒక్కటైనా నిజం ఉందా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని నమ్మవద్దని పిలుపునిచ్చారు. రద్దయిన, వాయిదాపడిన పరీక్షలు మళ్లీ నిర్వహించి అర్హులందరికీ ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. 6 నెలల్లో 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు.