IPL: ఐపీఎల్ లో నేడు డబుల్ ధమాకా

  • వీకెండ్ కావడంతో నేడు రెండు మ్యాచ్ లు
  • తొలి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో పంజాబ్ ఢీ
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్ కతా
  • రెండో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్
Double header in IPL

వీకెండ్ కావడంతో ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే రెండో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఆడనున్నాయి. ఇక, పంజాబ్, కోల్ కతా జట్ల మధ్య జరిగే మ్యాచ్ కు మొహాలీలోని పీసీఏ స్టేడియం వేదికగా నిలవనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ బౌలింగ్ ఎంచుకుంది. రెగ్యులర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయంతో దూరం కావడంతో, కోల్ కతా జట్టుకు నితీశ్ రాణా సారథ్యం వహిస్తున్నాడు.


పంజాబ్ కింగ్స్...
శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్ సిమ్రన్ సింగ్, భానుక రాజపక్స, జితేశ్ శర్మ, షారుఖ్ ఖాన్, శామ్ కరన్, సికందర్ రజా, నాథన్ ఎల్లిస్, హర్ ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్, అర్షదీప్ సింగ్.

కోల్ కతా నైట్ రైడర్స్...
నితీశ్ రాణా (కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్, మన్ దీప్ సింగ్, రింకు సింగ్, ఆండ్రీ రసెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ, అనుకూల్ రాయ్, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.

  • Loading...

More Telugu News