వైజాగ్ మెట్రో రైలు కోసం ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు: కేంద్రం
- 2017లోనే మెట్రో రైలు పాలసీని రూపొందించామన్న కేంద్రమంత్రి
- ఆర్థిక సాయం అందించేందుకు కొరియన్ ఎగ్జిమ్ బ్యాంకు ముందుకు రాలేదన్న హర్దీప్సింగ్ పూరి
- ఏపీ ప్రభుత్వం మరే విదేశీ బ్యాంకును సంప్రదించలేదని స్పష్టీకరణ
అలాగే, లిథియం గనుల వేలానికి సంబంధించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానమిస్తూ.. కడప, అనంతపురం జిల్లాల్లో విస్తరించిన పార్నపల్లె-లోపనూతుల ప్రాంతంలోని లిథియం గనుల కాంపోజిట్ లైసెన్సులతో కలిపి వేలం వేసే బాధ్యతను ఏపీ ప్రభుత్వానికి అప్పగించినట్టు చెప్పారు. తాటిరెడ్డిపల్లె బ్లాక్లో గనిని లీజుకు తీసుకున్న వారు అక్కడ వెలికితీసే లిథియం ఖనిజ సగటు అమ్మకం ధరపై 12 శాతం రాయల్టీని ఏపీ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందన్నారు. విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ బదులిస్తూ.. కాకినాడ-వైజాగ్-శ్రీకాకుళం మధ్య సహజవాయు సరఫరా పైప్లైన్ నిర్మాణం పూర్తి గడువును జూన్ 2024 వరకు పొడిగించినట్టు చెప్పారు.