తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం
- ఉపరితల ద్రోణీ కొనసాగుతుందని ప్రకటన
- ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయని హెచ్చరిక
ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు కూడా వీసే అవకాశం ఉందని చెప్పింది. కాగా, ఆదివారం అత్యధికంగా ములుగు జిల్లా వెంకటాపురంలో 156 మి.మీ. వర్షపాతం నమోదైంది.