ఎయిర్ ఇండియా విమానంలో మరో షాకింగ్ ఘటన
- లండన్ నుంచి ముంబై వస్తున్న విమానంలో కలకలం
- బాత్రూమ్లో పొగతాగిన ప్రయాణికుడు
- ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకూ యత్నం
కాగా, మార్చి 4న ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు ఇలాగే రచ్చ రచ్చ చేశాడు. కోల్కతా నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానంలో అతడు బాత్రూమ్లో పొగతాగాడు. ఈ క్రమంలో వెలువడ్డ పొగ కారణంగా అలారం మోగడంతో అప్రమత్తమైన సిబ్బంది గ్రౌండ్ కంట్రోల్కు సమాచారం అందించారు. విమానం లాండైన అనంతరం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అనీల్ మీరాగా గుర్తించారు.