Team India: మహిళల టీ20 వరల్డ్ కప్: ఐర్లాండ్ తో టీమిండియా కీలక మ్యాచ్

  • దక్షిణాఫ్రికా గడ్డపై మహిళల టీ20 వరల్డ్ కప్
  • ఐర్లాండ్ పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • ఈ మ్యాచ్ లో గెలిస్తే నేరుగా సెమీస్ చేరిక
  • పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో ఉన్న భారత్
Team India eves plays against Ireland in a crucial match

దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా కీలక మ్యాచ్ కు సిద్ధమైంది. నేడు గ్రూప్-బి లో టీమిండియా తన చివరి లీగ్ మ్యాచ్ ను ఐర్లాండ్ తో ఆడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా అమ్మాయిలు బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా సెమీస్ చేరుతుంది. ఓడిపోతే మాత్రం ఇతర మ్యాచ్ ఫలితాల కోసం వేచిచూడాల్సి ఉంటుంది. 

గ్రూప్- బి లో ఇప్పటివరకు తానాడిన మూడు మ్యాచ్ ల్లో భారత్ రెండు విజయాలు సాధించింది. పాకిస్థాన్, వెస్టిండీస్ లను ఓడించిన భారత్... ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్... ఇంగ్లండ్ తర్వాత రెండోస్థానంలో ఉంది.

More Telugu News