సిరీస్ మధ్యలో జట్టుని విడిచి స్వదేశం వెళ్లిపోయిన ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్
- కుటుంబ పని మీద సోమవారం ఉదయం ప్రయాణం
- మూడో టెస్టు మ్యాచ్ కు ముందు తిరిగొచ్చే అవకాశం
- తొలి రెండు టెస్టుల్లో తేలిపోయిన ఆస్ట్రేలియా
ఈ సిరీస్లో భారత్ చేతిలో క్లీన్స్వీప్కు గురైతే ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంది. ఢిల్లీలో మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టులో భారత స్పిన్నర్ల ముందు ఆసీస్ బ్యాటర్లు తేలిపోయారు. ఈ మ్యాచ్ తర్వాత కమిన్స్ మాట్లాడుతూ.. తమ బ్యాటర్లు భారత్లో పరుగులు సాధించే మార్గాన్ని కనుగొనాలని చెప్పాడు. ‘మ్యాచ్ ఓటమి తర్వాత తమ బ్యాటింగ్ పై ఆటగాళ్లు సమీక్ష చేసుకుంటారని భావిస్తున్నా. ముఖ్యంగా మా షాట్ సెలెక్షన్ సరైన పద్ధతిలోనే ఉందా? లేదా? అనే విషయంపై ఆలోచించుకోవాలి. దురదృష్టవశాత్తూ మాలో చాలా మంది క్రాస్-బ్యాటింగ్ షాట్లతో ఔట్ అయ్యారు. ఇది మేం ఇష్టపడే పద్ధతి కాకపోవచ్చు’ అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.