టీ20 ప్రపంచ కప్ ముంగిట భారత మహిళల జట్టుకు చుక్కెదురు
- ముక్కోణపు టీ20 సిరీస్ ఫైనల్లో పరాజయం
- 5 వికెట్ల తేడాతో భారత్ ను ఓడించిన దక్షిణాఫ్రికా
- ఈ నెల 10 నుంచి టీ20 ప్రపంచ కప్
అనంతరం చిన్న లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చ్లో ట్రయాన్ 32 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 57 పరుగులు చేసి జట్టును గెలిపించింది. ఆమెకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా రెండు వికెట్లు దక్కించుకొంది. భారత ఆల్ రౌండర్ దీప్తి శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచింది. కాగా, టీ20 ప్రపంచ కప్ దక్షిణాఫ్రికా వేదికగా ఈ నెల 10 నుంచి 26 వరకు జరుగుతుంది.