నోబెల్ విజేత అమర్త్యసేన్ ను బీజేపీ ఈ విధంగా అవమానించడం సరికాదు: మమతా బెనర్జీ
- నోబెల్ విజేత అమర్త్యసేన్ పై భూ ఆక్రమణ ఆరోపణలు
- లేఖ రాసిన విశ్వభారతి వర్సిటీ యాజమాన్యం
- అమర్త్యసేన్ కు మద్దతుగా నిలిచిన సీఎం మమతా బెనర్జీ
- వర్సిటీ తీరును తప్పుబట్టిన వైనం
ఈ నేపథ్యంలో, బిర్భూమ్ లోని పూర్వీకుల ఇంట్లో ఉన్న అమర్త్యసేన్ ను మమతా బెనర్జీ కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అమర్త్యసేన్ వంటి వ్యక్తిని బీజేపీ ఈ విధంగా అవమానించడం సరికాదని హితవు పలికారు.
"అమర్త్యసేన్ ఎంతో గొప్ప వ్యక్తి. ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తారా? కాషాయీకరణ పోకడలకు పోకుండా, విశ్వభారతి యాజమాన్యం సరైన పంథాలో నడవాలని కోరుకుంటున్నాను" అని మమతా బెనర్జీ తెలిపారు.