Chiranjeevi: బాలయ్య సినిమా వన్ మేన్ షో .. చిరూ మూవీ టూమేన్ షో: తమ్మారెడ్డి

  • ఈ నెల 12న వచ్చిన 'వీరసింహారెడ్డి'
  • 13వ తేదీన విడుదలైన 'వాల్తేరు వీరయ్య'
  • 100 కోట్ల వసూళ్లను క్రాస్ చేసిన సినిమాలు 
  • ఇద్దరు హీరోలు సమానమేనన్న తమ్మారెడ్డి   
Thammareddy Bharadwaja interview

చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' .. బాలయ్య 'వీరసింహారెడ్డి' సినిమాలు ఈ సంక్రాంతి బరిలో సక్సెస్ లను నమోదు చేశాయి. వసూళ్ల పరంగా కూడా ఈ రెండు సినిమాలు పోటీలు పడుతూ దూసుకువెళుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలను గురించి ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. 

"ఈ సంక్రాంతికి వచ్చిన రెండు పెద్ద సినిమాలు బాగానే ఆడుతున్నాయి. ఎవరు ఎక్కువ .. ఎవరు తక్కువ అని చెప్పలేం .. ఇద్దరూ సమానమే. రెండు సినిమాలు కూడా 100 కోట్ల వసూళ్లను దాటేసినవే. బాలయ్య తన సినిమాలో సోలోగా కనిపిస్తారు. చిరంజీవిగారి సినిమాలో రవితేజగారు కూడా ఉన్నారు. అది వన్ మేన్ షో అయితే .. ఇది టూ మేన్ షో" అన్నారు. 

"గతంలో సంక్రాంతి పండుగ సినిమాలంటే, విలేజ్ నేపథ్యంలో నడిచే ఫ్యామిలీ సినిమాలు వచ్చేవి. మన సంస్కృతి .. సంప్రదాయాలను టచ్ చేస్తూ ఆ కథలు నడిచేవి. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు .. కుటుంబ సభ్యుల మధ్య ఎమోషన్స్ తగ్గిపోతున్నాయి. అందుకు తగినట్టుగానే పండగ సినిమాల్లోను మార్పు వచ్చింది' అని చెప్పుకొచ్చారు.

More Telugu News