మోదీకి సానుభూతిని తెలిపిన కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు
- ఈ తెల్లవారుజామున మృతి చెందిన హీరాబెన్
- గాంధీనగర్ లో ముగిసిన అంత్యక్రియలు
- తల్లి చితికి నిప్పంటించిన మోదీ
హీరాబెన్ మోదీ ఈ తెల్లవారుజామున 3.40 గంటలకు అహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా ఆసుపత్రిలో కన్నుమూశారు. వందేళ్ల పాటు ఆమె సంపూర్ణ జీవితాన్ని అనుభవించారు. ఆరోగ్యం విషమించడంతో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. గాంధీనగర్ లో ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి. తన తల్లి పాడిని మోసిన మోదీ, ఆమె చితికి నిప్పంటించారు.