Nirmala Sitharaman: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన నిర్మలా సీతారామన్

  • ఇటీవల అనారోగ్యానికి గురైన నిర్మలా సీతారామన్
  • సోమవారం నాడు ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిక
  • కోలుకున్న వైనం
  • ఆసుపత్రి నుంచి నేరుగా నివాసానికి పయనం 
Nirmala Sitharaman discharges from AIIMS

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (63) ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. నిర్మలా సీతారామన్ తీవ్ర జ్వరంతో బాధపడుతూ సోమవారం ఉదయం ఆసుపత్రిలో చేరారు. ఆమె ఉదర సంబంధ ఇన్ఫెక్షన్, వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్టు వార్తలు వచ్చాయి. చికిత్స అనంతరం ఆమె కోలుకున్నారు. 

జ్వరం తగ్గడంతో ఆమెను ఎయిమ్స్ వైద్యులు డిశ్చార్జి చేశారు. ఆసుపత్రి నుంచి నిర్మల నేరుగా తన నివాసానికి వెళ్లిపోయారు. కొంత విశ్రాంతి అనంతరం, బడ్జెట్ రూపకల్పన కసరత్తుల్లో పాలుపంచుకోనున్నారు.

More Telugu News