ప్రభుత్వ బడుల్లోనూ సెమిస్టర్ విధానం... సీఎం జగన్ కీలక నిర్ణయం
- ఏపీ విద్యావ్యవస్థలో సంస్కరణలు
- వచ్చే విద్యా సంవత్సరం నుంచి సెమిస్టర్ విధానం
- తొలుత 1 నుంచి 9వ తరగతి వరకు అమలు
- 2024-25 నుంచి 10వ తరగతికి కూడా వర్తింపు
2023-24 విద్యాసంవత్సరం నుంచి సెమిస్టర్ విధానాన్ని వర్తింపజేయాలని సీఎం జగన్ ఆదేశించారు. తొలుత 1 నుంచి 9వ తరగతి వరకు సెమిస్టర్ విధానం అమలు చేయనున్నారు. 2024-25 విద్యాసంవత్సరం నుంచి 10వ తరగతిలోనూ సెమిస్టర్ విధానం ప్రవేశపెడతారు. ఈ మేరకు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సెమిస్టర్ విధానానికి అనుగుణంగా పాఠ్యపుస్తకాలను కూడా రూపొందించనున్నారు.