రాష్ట్రంలో బీజేపీ పాలన మరో 100 రోజులే... 136 స్థానాల్లో గెలుస్తాం: డీకే శివకుమార్
- అత్యంత అవినీతి రాష్ట్రంగా కర్ణాటక నిలిచిందన్న డీకే
- వచ్చే ఎన్నికల్లో బీజేపీ 60 నుంచి 70 సీట్లకు పరిమితమవుతుందని జోస్యం
- గుజరాత్ ప్రభావం కర్ణాటకపై ఉండదని వ్యాఖ్య
గత మూడేళ్ల కాలంలో ప్రజల కడుపు నింపే ఒక్క పథకాన్ని కూడా బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదని శివకుమార్ చెప్పారు. దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రంగా కర్ణాటకకు పేరు వచ్చిందని మండిపడ్డారు. గుజరాత్ ఎన్నికల ప్రభావం కర్ణాటకపై ఉండదని చెప్పారు. కాంగ్రెస్ లో సీఎం ఎవరనే విషయం గురించి బీజేపీ నేతలు చర్చించడం... వారు ఓటమిని అంగీకరించడమేనని అన్నారు. తనను రౌడీ షీటర్ అంటున్నారని... దానికి ఎక్కడైనా ఆధారాలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు.