Helicopter: యాదాద్రిలో ప్రైవేటు హెలికాప్టర్‌కు పూజలు.. చూసేందుకు ఎగబడిన జనం!

  • హెలికాప్టర్‌ను కొనుగోలు చేసిన బోయినపల్లి శ్రీనివాసరావు
  • యాదాద్రి పెద్దగుట్టపై ప్రత్యేక పూజలు
  • పాల్గొన్న శ్రీనివాసరావు, సీహెచ్ విద్యాసాగర్, కుటుంబ సభ్యులు
Special Vahana Puja For New Helicopter At Yadadri

సాధారణంగా కొత్త వాహనాలను ప్రారంభించడానికి ముందు పూజలు చేయడం సర్వసాధారణ విషయమే. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో నిత్యం వాహన పూజలు జరుగుతుంటాయి. అయితే, తొలిసారి ఓ హెలికాప్టర్‌కు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కరీంనగర్‌కు చెందిన ప్రతిమా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎండీ, హైదరాబాద్ ఎయిర్‌ లైన్స్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్ బోయినపల్లి శ్రీనివాసరావు ఈ హెలికాప్టర్‌ను కొనుగోలు చేశారు. యాదాద్రి పెద్దగుట్టపై నిన్న ఈ హెలికాప్టర్‌కు పూజారులు పూజలు చేశారు. చాపర్ యజమాని బోయినపల్లి శ్రీనివాసరావు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌ రావుతోపాటు వారి కుటుంబ సభ్యులు ఈ పూజల్లో పాల్గొన్నారు. హెలికాప్టర్‌ను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

More Telugu News