Sensex: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • ద్రవ్యోల్బణం తగ్గడంతో మార్కెట్లలో జోష్
  • 403 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 111 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ద్రవ్యోల్బణం 11 నెలల కనిష్ఠానికి పడిపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 403 పాయింట్లు లాభపడి 62,533కి ఎగబాకింది. నిఫ్టీ 111 పాయింట్లు పెరిగి 18,608 వద్ద స్థిరపడింది. టెలికాం, టెక్, ఐటీ సూచీలు ఒక శాతానికిపై పైగా పెరిగాయి. 


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.46%), బజాజ్ ఫైనాన్స్ (1.75%), ఇన్ఫోసిస్ (1.65%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.60%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.59%). 

టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-0.57%), టాటా స్టీల్ (-0.54%), మారుతి (-0.43%), టైటాన్ (-0.31%), డాక్టర్ రెడ్డీస్ (-0.17%).

More Telugu News