Sensex: గుజరాత్ ఎఫెక్ట్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • గుజరాత్ లో బీజేపీ గెలుపుతో మార్కెట్లలో జోష్
  • 160 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 49 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లలో నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. ఈరోజు మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. కీలకమైన గుజరాత్ లో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 160 పాయింట్లు లాభపడి 62,571కి చేరుకుంది. నిఫ్టీ 49 పాయింట్లు పెరిగి 18,609 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (3.57%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.56%), టీసీఎస్ (0.90%), కోటక్ బ్యాంక్ (0.72%), నెస్లే ఇండియా (0.68%). 

టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్ (-2.71%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.31%), ఎల్ అండ్ టీ (-2.06%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.02%), ఇన్ఫోసిస్ (-0.93%).

More Telugu News