యూనివర్శిటీ గోడలపై బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు.. ఢిల్లీ జేఎన్యూలో ఉద్రిక్తత
- క్యాంపస్ ను బ్రాహ్మణులు విడిచి వెళ్లాలని రాతలు
- దర్యాప్తుకు ఆదేశించిన యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్
- బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్
క్యాంపస్ ను బ్రాహ్మణులు విడిచి వెళ్లాలి... బ్రాహ్మణ్-బనియాలపై ప్రతీకారం తీర్చుకుంటాం... బ్రాహ్మణ్ భారత్ చోడో వంటి పిచ్చి రాతలు రాశారు. దీంతో, వర్శిటీ క్యాంపస్ లో అలజడి చెలరేగింది. దీనిపై యూనివర్శిటీ వైస్ ఛాన్సెలర్ శాంతిశ్రీ పండిట్ దర్యాప్తుకు ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై ఏబీవీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న విద్యార్థుల పనేనని ఏబీవీపీ ఆరోపించింది.