Sensex: లాభాల్లో ముగిసిన మార్కెట్లు... 62 వేలకు చేరువలో సెన్సెక్స్!

  • 108 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 6 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 2.73 శాతం పెరిగిన కొటక్ బ్యాంక్ షేర్ విలువ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. పోలండ్ భూభాగంపై క్షిపణి పడిన నేపథ్యంలో అంతర్జాతీయంగా ఆందోళన నెలకొంది. ఇది అంతర్జాతీయ మార్కెట్లపై కూడా ప్రభావం చూపింది. ఈ క్రమంలో మన మార్కెట్లు కూడా ఉదయం నష్టాలతోనే ట్రేడింగ్ ను ప్రారంభించాయి. ఆ తర్వాత కూడా ఒడిదుడుకుల్లోనే కొనసాగాయి. చివరకు లాభాల్లో ముగిశాయి. 

ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 108 పాయింట్లు లాభపడి 61,980కి చేరుకుంది. 62 వేలకు చేరువయింది. నిఫ్టీ 6 పాయింట్ల స్వల్ప లాభంతో 18,410 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
కొటక్ బ్యాంక్ (2.73%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.98%), డాక్టర్ రెడ్డీస్ (0.92%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.80%), భారతి ఎయిర్ టెల్ (0.77%). 

టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-1.89%), టాటా స్టీల్ (-1.80%), ఎన్టీపీసీ (-1.19%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.15%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.73%).

More Telugu News