Sensex: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

markets ends in losses
  • లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
  • 170 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 20 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత స్వల్ప లాభాల్లోకి వెళ్లిన మార్కెట్లు ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 170 పాయింట్లు నష్టపోయి 61,624కి పడిపోయింది. నిఫ్టీ 20 పాయింట్లు కోల్పోయి 18,329 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
కోటక్ బ్యాంక్ (1.27%), టాటా స్టీల్ (1.07%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.05%), ఇండస్ ఇండ్ బ్యాక్ (1.04%), ఇన్ఫోసిస్ (0.89%). 

టాప్ లూజర్స్:
డాక్టర్ రెడ్డీస్ (-3.94%), ఐటీసీ (-2.57%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.83%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.42%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.32%).
Sensex
Nifty
Stock Market

More Telugu News