T20 World Cup: పాకిస్థాన్​తో సెమీఫైనల్​.. టాస్​ నెగ్గి బ్యాటింగ్​ ఎంచుకున్న న్యూజిలాండ్

  • తుది జట్లలో మార్పులు లేకుండా బరిలోకి ఇరు జట్లు
  • సూపర్ 12 లో గ్రూప్1లో న్యూజిలాండ్ కు అగ్రస్థానం
  • గ్రూప్2లో రెండో స్థానంతో సెమీస్ చేరిన పాక్
Unchanged NZ win the toss and opt to bat

పాకిస్థాన్ తో టీ20 ప్రపంచ కప్ తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్లో కివీస్ తన తుది జట్టులో ఎలాంటి మార్పు చేయలేదు. ఇంకోవైపు పాక్ కూడా సూపర్ 12 రౌండ్ చివరి మ్యాచ్ లో ఆడిన తుది జట్టునే కొనసాగించింది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఆదివారం మెల్ బోర్న్ లో జరిగే పైనల్ చేరుతుంది. సూపర్ 12 దశలో నిలకడగా ఆడిన న్యూజిలాండ్ గ్రూప్1లో అగ్రస్థానం సాధించింది. మరోవైపు పాకిస్థాన్ గ్రూప్2లో రెండో స్థానంతో సెమీస్ చేరుకుంది.
 
పాకిస్థాన్ తుది జట్టు: మహ్మద్ రిజ్వాన్ (కీపర్), బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, హరీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది.
న్యూజిలాండ్ తుది జట్టు: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే (కీపర్),  కేన్ విలియమ్సన్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ, ఇష్ సోధీ, లోకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.

More Telugu News