Stock Market: వారాన్ని లాభాలతో ముగించిన స్టాక్ మార్కెట్లు

  • మార్కెట్ల రెండు రోజుల నష్టాలకు బ్రేక్
  • 114 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 64 పాయింట్ల లాభంతో నిఫ్టీ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. రెండు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 114 పాయింట్లు లాభపడి 60,950కి చేరుకుంది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 18,117 వద్ద స్థిరపడింది. మెటల్ సూచీ 3 శాతం వరకు లాభపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: 
బజాజ్ ఫిన్ సర్వ్ (4.55%), అల్ట్రాటెక్ సిమెంట్ (2.50%), టాటా స్టీల్ (2.50%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.53%), రిలయన్స్ (1.43%). 

టాప్ లూజర్స్:
డాక్టర్ రెడ్డీస్ (-1.49%), ఇన్ఫోసిస్ (-1.08%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.03%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.76%), ఎన్టీపీసీ (-0.73%).

More Telugu News