న్యాయం గెలిచింది... న్యాయమే గెలుస్తుంది: చంద్రబాబు
- అయ్యన్న రిమాండ్ కు తిరస్కరించిన విశాఖ కోర్టు
- అయ్యన్నతో పాటు రాజేశ్ కు బెయిల్ ఇచ్చిన వైనం
- ఈ విషయంపై హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు
- అయ్యన్నతోనే తామున్నామంటూ హ్యాష్ ట్యాగ్ పోస్ట్
2 సెంట్ల భూమి ఆక్రమణకు అయ్యన్న, ఆయన ఇద్దరు కుమారులు ఫోర్జరీ పత్రాలను సృష్టించారన్న ఆరోపణల కింద గురువారం తెల్లవారుజామున అయ్యన్నతో పాటు ఆయన కుమారుడు రాజేశ్ ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిందితులిద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించి సాయంత్రానికి విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసును పరిశీలించిన న్యాయమూర్తి ఈ కేసులో నిందితులపై మోపిన ఐపీసీ 467 సెక్షన్ వర్తించదని తేల్చారు. దీంతో నిందితులకు అక్కడికక్కడే బెయిల్ మంజూరు చేశారు.