Siddhu: టిల్లు సీక్వెల్ పై ఆసక్తి మామూలుగా లేదే!

  • సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన 'డీజే టిల్లు'
  • సీక్వెల్ కోసం మొదలైన సన్నాహాలు
  • ఈ సారి కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ 
  • దర్శకుడిగా మల్లిక్ రామ్
  • వచ్చే ఏడాది మార్చిలో విడుదల
Tillu 2 movie update

'డీజే టిల్లు' ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సితార - ఫార్చ్యూన్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి, విమల్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమాకి, యూత్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో భారీ వసూళ్లను రాబట్టింది. చిన్న సినిమా సాధించిన పెద్ద విజయంగా అంతా చెప్పుకున్నారు. 

ఈ సినిమాకి సీక్వెల్ రూపొందనుందనే మాట చాలా కాలం నుంచి వినిపిస్తూ వస్తోంది. తాజాగా ఈ సినిమా సీక్వెల్ కి టైటిల్ ను ఖరారు చేశారు. 'టిల్లు స్క్వైర్' అనే టైటిల్ ను ఖరారు చేసి, దీపావళి కానుకగా పోస్టర్ ను రిలీజ్ చేశారు. అలాగే ప్రోమోను కూడా వదిలారు. ఈ కంటెంట్ ను రిలీజ్ చేసిన రెండు గంటలలోనే వన్ మిలియన్ వ్యూస్ లభించడం విశేషం. ఈ సినిమా పట్ల అంతా ఎంతో ఆసక్తితో ఉన్నారనడానికి ఇది ఒక నిదర్శనం. 

మల్లిక్ రామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా రూపొందనున్న ఈ సినిమాకి, శ్రీచరణ్ పాకాల - రామ్ మిరియాల సంగీతాన్ని సమకూర్చనున్నారు. ఫస్టు పార్టులో నేహా శెట్టి కథానాయికగా నటించగా, సెకండ్ పార్టులో అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నట్టుగా ప్రకటించారు. మార్చి 2023లో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు.

More Telugu News