Kancha Ilaiah: కోర్టుకు హాజరైన ప్రొఫెసర్ కంచ ఐలయ్య

  • వివాదాస్పదమైన కంచ ఐలయ్య పుస్తకం 'మతతత్వం'
  • న్యాయ వ్యవస్థను కించపరిచారంటూ కేసు నమోదు
  • 2017లో పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ నేత మహేందర్ రెడ్డి
Professor Kancha Ilaiah attends court

ప్రముఖ రచయిత, సామాజికవేత్త, ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఈ ఉదయం కరీంనగర్ జిల్లా కోర్టుకు హాజరయ్యారు. ఆయన రచించిన 'మతతత్వం' పుస్తకం వివాదాస్పదమయింది. ఈ పుస్తకంలో న్యాయ వ్యవస్థను కించపరిచారంటూ ఆయనపై కేసు నమోదయింది. 2017లో బీజేపీ నేత, న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఐలయ్యపై కేసు నమోదు చేశారు. 

ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు కంచ ఐలయ్యకు పోలీసులు సమన్లను అందించారు. ఈ నేపథ్యంలో ఆయన కోర్టుకు హాజరయ్యారు.

More Telugu News