హీరో ప్ర‌భాస్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

delhi high court issues notices to prabhas and adipurush team
  • 'ఆదిపురుష్'‌లో రాముడిగా న‌టిస్తున్న ప్ర‌భాస్‌
  • 'ఆదిపురుష్'‌ పై వివాదాలు
  • హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ తీశారంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిష‌న్‌
  • సినిమా విడుద‌ల‌పై స్టే విధించాల‌ని అభ్యర్థ‌న‌
  • 'ఆదిపురుష్' చిత్ర యూనిట్‌కూ కోర్టు నోటీసులు
టాలీవుడ్ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌కు ఢిల్లీ హైకోర్టు సోమ‌వారం నోటీసులు జారీ చేసింది. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న 'ఆదిపురుష్' సినిమాలో రాముడి పాత్ర‌లో ప్ర‌భాస్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు చెందిన టీజ‌ర్ ఇటీవ‌లే రిలీజ్ కాగా... ప‌లు వ‌ర్గాలు టీజ‌ర్‌పై అభ్యంత‌రం వ్యక్తం చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలో 'ఆదిపురుష్' సినిమాలో హిందువుల మ‌నోభావాల‌ను గాయ‌ప‌రిచారంటూ ఓ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా 'ఆదిపురుష్' సినిమా విడుద‌ల‌పై స్టే విధించాల‌ని కూడా స‌ద‌రు సంస్థ కోర్టును కోరింది. 

ఈ పిటిష‌న్‌పై సోమ‌వారం విచార‌ణ చేప‌ట్టిన ఢిల్లీ హైకోర్టు హీరో ప్ర‌భాస్‌కు నోటీసులు జారీ చేసింది. ప్ర‌భాస్‌తో పాటు 'ఆదిపురుష్' చిత్ర యూనిట్‌కు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది.
Go Back to Shorts
Prabhas
Adiourush
Delhi High Court

More Telugu News