Sensex: రెండు రోజుల ర్యాలీకి బ్రేక్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • 262 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 97 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 3 శాతానికి పైగా నష్టపోయిన ఇండస్ ఇండ్ బ్యాంక్
markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఉక్రెయిన్ పై రష్యా దాడిని ముమ్మరం చేయడం, ఈరోజు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈ క్రమంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 262 పాయింట్లు కోల్పోయి 59,456కి పడిపోయింది. నిఫ్టీ 97 పాయింట్లు నష్టపోయి 17,718 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (1.60%), ఐటీసీ (1.59%), బజాజ్ ఫైనాన్స్ (0.76%), టెక్ మహీంద్రా (0.51%), రిలయన్స్ (0.29%). 

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.19%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.64%), అల్ట్రాటెక్ సిమెంట్ (-2.40%), ఎల్ అండ్ టీ (-1.88%), ఎన్టీపీసీ (-1.83%).

More Telugu News