Sensex: వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in profits
  • 579 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 194 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 4 శాతానికి పైగా లాభపడ్డ సన్ ఫార్మా షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. వరుసగా రెండో రోజు లాభాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 579 పాయింట్లు లాభపడి 59,719కి చేరుకుంది. నిఫ్టీ 194 పాయింట్లు పెరిగి 17,816 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (4.22%), డాక్టర్ రెడ్డీస్ (3.31%), టాటా స్టీల్ (2.86%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.77%), టైటాన్ (2.10%). 

టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-0.64%), ఐటీసీ (-0.22%), ఇన్ఫోసిస్ (-0.21%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.15%), రిలయన్స్ (-0.11%).
Sensex
Nifty
Stock Market

More Telugu News