Janasena: చేతికి క‌ట్టుతో జ‌న సైనికుల విరాళాన్ని స్వీక‌రించిన నాగ‌బాబు.. ఫొటో ఇదిగో

  • నా సేన కోసం... నా వంతు.. పేరిట విరాళాల‌కు పిలుపు నిచ్చిన జ‌న‌సేన‌
  • రూ.4 ల‌క్ష‌ల విరాళాన్ని అంద‌జేసిన నెల్లిమ‌ర్ల జ‌న సైనికులు
  • విరాళం సేక‌రిస్తున్న సంద‌ర్భంగా చేతికి క‌ట్టుతో క‌నిపించిన నాగ‌బాబు
janasena pac member nagababu recieves cheque from jana sena cadre with a bandage on his hand

నా సేన కోసం.. నా వంతు.. పేరిట జ‌న‌సేన చేప‌ట్టిన పిలుపున‌కు జ‌న సైనికుల నుంచి భారీ స్పంద‌నే ల‌భిస్తోంది. చిన్న మొత్తాల నుంచి ల‌క్ష‌ల మేర విరాళాలు ఆ పార్టీకి అందుతున్నాయి. ఈ క్ర‌మంలో విజ‌య‌న‌గ‌రం జిల్లా నెల్లిమ‌ర్ల అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గానికి చెందిన జ‌న సైనికులు రూ.4 ల‌క్ష‌ల విరాళాన్ని మంగ‌ళ‌వారం పార్టీకి అంద‌జేశారు.

ఈ విరాళాన్ని పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ (పీఏసీ) స‌భ్యుడు నాగ‌బాబు అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా కుడి చేతికి క‌ట్టుతో ఆయ‌న క‌నిపించారు. చేతికి కట్టుతోనే బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆయ‌న జ‌న సైనికుల నుంచి విరాళానికి చెందిన చెక్కును అందుకున్నారు. అయితే, ఏ కార‌ణంగా ఆయ‌న చేతికి క‌ట్టు క‌ట్టుకున్నార‌న్న విష‌యం వెల్ల‌డి కాలేదు. ఈ సందర్భంగా పార్టీ పటిష్ఠత కోసం సమైక్యంగా శ్రమించాల‌ని ఆయ‌న జ‌న సైనికుల‌కు సూచించారు.

More Telugu News