భార‌త్ జోడో యాత్రను ప్రారంభించిన రాహుల్ గాంధీ... వీడియో ఇదిగో

rahul gandhi starts his bharat jodo yatra
  • క‌న్యాకుమారిలో యాత్ర‌ను ప్రారంభించిన రాహుల్‌
  • సేవా ద‌ళ్ శ్రేణుల వెనుకే తొలి అడుగు వేసిన నేత‌
  • క‌శ్మీర్‌ వరకు సాగనున్న పాదయాత్ర ‌
2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌య‌మే లక్ష్యంగా ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ త‌ల‌పెట్టిన‌ భార‌త్ జోడో యాత్ర బుధ‌వారం సాయ‌త్రం ప్రారంభం అయ్యింది. బుధ‌వారం సాయంత్రం 5 గంట‌ల‌కు త‌మిళ‌నాడులోని క‌న్యాకుమారిలో రాహుల్ త‌న యాత్ర‌ను ప్రారంభించారు. త‌న ముందు పార్టీ సేవా ద‌ళ్‌ శ్రేణులు క‌దం తొక్కుతూ సాగ‌గా... రాహుల్ గాంధీ త‌న సుదీర్ఘ యాత్ర‌ను ప్రారంభించారు. 

దాదాపుగా 150 రోజుల పాటు సాగ‌నున్న ఈ యాత్ర‌ 3,570 కిలోమీట‌ర్ల మేర కొన‌సాగ‌నుంది. క‌న్యాకుమారిలో మొద‌లైన ఈ యాత్ర క‌శ్మీర్‌లో ముగియ‌నుంది. దేశంలోని మెజారిటీ రాష్ట్రాల మీదుగా ఈ యాత్ర సాగేలా కాంగ్రెస్ పార్టీ రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. రాహుల్ గాంధీ యాత్ర చేప‌ట్టడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వ్య‌క్త‌మ‌వుతోంది.
Go Back to Shorts
Congress
Rahul Gandhi
Bharat Jodo Yatra
Kanya Kumari

More Telugu News