YSRCP: వైసీపీ మ‌హిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్య‌లు... టీడీపీ మ‌హిళా నేత‌పై కేసు న‌మోదు

  • సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌ద్మావ‌తిపై అనుచిత వ్యాఖ్య‌లు
  • పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన భీమిశెట్టి శ్రీనివాసులు
  • ఏలూరులోని ఇంటి వ‌ద్ద అనూష‌కు నోటీసులు ఇచ్చిన శింగ‌న‌మ‌ల పోలీసులు
singanamala police files a case on tdp leader undavalli anusha overs social media posts on ysrcp mla jonnalagadda padmavathi

వైసీపీ మ‌హిళా నేత‌, అనంత‌పురం జిల్లా శింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తిపై సోష‌ల్ మీడియాలో అనుచిత వ్యాఖ్య‌లు పోస్ట్ చేసిన వైనంపై శింగ‌న‌మ‌ల పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. ఈ కేసులో ఏలూరు జిల్లాకు చెందిన టీడీపీ మ‌హిళా నేత ఉండ‌వ‌ల్లి అనూష‌ను నిందితురాలిగా చేరుస్తూ శింగ‌న‌మ‌ల పోలీసులు కేసు న‌మోదు చేశారు. 

అంతేకాకుండా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్య‌ల‌పై 3 రోజుల్లోగా సంజాయ‌షీ ఇవ్వాలంటూ ఉండ‌వ‌ల్లి అనూష‌కు ఏలూరులోని ఆమె ఇంటి వ‌ద్దే శింగ‌న‌మ‌న‌ల పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ వ్య‌వ‌హారంలో భీమిశెట్టి శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కే ఉండ‌వ‌ల్లి అనూష‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

More Telugu News