Sensex: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

  • రేట్లను పెంచుతున్న పలు దేశాల కేంద్ర బ్యాంకులు
  • 872 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 267 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
Markets ends in huge losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా అన్ని కేంద్ర బ్యాంకులు రేట్లను పెంచుతుండటం మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ క్రమంలో ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 872 పాయింట్లు నష్టపోయి 58,773కి పడిపోయింది. నిఫ్టీ 267 పాయింట్లు పతనమై 17,490కి దిగజారింది. మార్కెట్లలో ఈరోజు అన్ని సూచీలు నష్టపోయాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం ఐటీసీ (0.64్%), నెస్లే ఇండియా (0.28%) మాత్రమే లాభాల్లో ముగిశాయి. టాటా స్టీల్ (-4.50%), ఏసియన్ పెయింట్స్ (-3.51%), విప్రో (-2.96%), సన్ ఫార్మా (-2.90%), ఎల్ అండ్ టీ (-2.87%) కంపెనీలు టాప్ లూజర్లుగా ఉన్నాయి.

More Telugu News