వివాహ వార్షికోత్సవాన జగన్ ఆశీస్సులు తీసుకున్న మంత్రి రోజా... ఫొటోలు ఇవిగో
- సెల్వమణితో రోజా వివాహం
- ఆదివారం నాటికి 20 ఏళ్లు పూర్తి అయిన వైవాహిక బంధం
- కాణిపాకం ఆలయంలో రోజా దంపతుల పూజలు
- తాడేపల్లిలో జగన్ ఆశీర్వాదం తీసుకున్న మంత్రి దంపతులు
సెల్వమణితో తన వివాహం జరిగి నేటికి 20 ఏళ్లు అవుతోందని రోజా పేర్కొన్నారు. ఈ 20 ఏళ్ల జీవితాన్ని ఒక్కసారిగా పరిశీలించుకుంటే... అన్నీ సంతోషకరమైన దినాలు కనిపించాయని ఆమె తెలిపారు. ఇకపైనా సంతోషకర జీవితాన్ని గడిపే దిశగా తాము సాగనున్నామని కూడా ఆమె తెలిపారు.