Mahesh Babu: 100 రోజులు పూర్తిచేసుకున్న 'సర్కారువారి పాట'

  • మే 12న విడుదలైన 'సర్కారువారి పాట'
  • పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్
  • మహేశ్ జోడీగా అలరించిన కీర్తి సురేశ్
  • సినిమాను నిలబెట్టిన తమన్ సంగీతం  
Sarkaru Vaari Paata movie 100 days completed

మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' తెరకెక్కింది. మైత్రీ - 14 రీల్స్ సంస్థలు నిర్మించిన ఈ సినిమాకి మహేశ్ బాబు కూడా ఒక నిర్మాతగా ఉన్నాడు. మహేశ్ బాబు సరసన నాయికగా కీర్తి సురేశ్ నటించిన ఈ సినిమా, మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

తాజాగా ఈ సినిమా 100 రోజులను పూర్తిచేసుకుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోను .. విశాఖ జిల్లా గోపాలపట్నంలోను రోజుకి 4 ఆటలతో ప్రదర్శితమవుతూ ఈ సినిమా 100 రోజులను పూర్తిచేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ స్పెషల్ పోస్టర్ ను వదిలింది. 

మహేశ్ - కీర్తి సురేశ్ జోడీకి .. వాళ్ల లవ్ ట్రాక్ కి మంచి మార్కులు పడిపోయాయి. సముద్రఖని విలనిజం హైలైట్ గా నిలిచింది. తమన్ సంగీతం ఈ సినిమాను నిలబెట్టింది. ఆయన పాటల్లో 'మ మ మహేశా' మాస్ ఆడియన్స్ లోకి ఒక రేంజ్ లో దూసుకుని వెళ్లింది. మొత్తం మీద ఈ సినిమాతో పరశురామ్ మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

More Telugu News