Tourism Market: వచ్చే రెండేళ్లలో రెట్టింపు కానున్న భారత పర్యాటక విపణి విలువ

  • భారత్ లో పెరుగుతున్న పర్యాటకం
  • తాజా నివేదికలో ఆసక్తికర అంశాలు
  • 2024 నాటికి రూ.30 లక్షల కోట్లు దాటనున్న టూరిజం మార్కెట్
A report on outbound travel tourism

రాబోయే రెండేళ్లలో భారత్ నుంచి జరిగే అంతర్జాతీయ పర్యాటకం విలువ రెట్టింపు కానుందని ఓ నివేదిక చెబుతోంది. భారత అంతర్జాతీయ పర్యాటకం విలువ 2024 నాటికి రూ.30 లక్షల కోట్లు దాటనుందని అంచనా. పర్యాటక మార్కెట్ విలువ పెరుగుతున్న నేపథ్యంలో ఈ రంగానికి మరింత ఊపునిచ్చేందుకు కేంద్రం కొన్ని విధానపరమైన మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉందని ఆ నివేదికలో వెల్లడించారు. 'అవుట్ బౌండ్ ట్రావెల్ అండ్ టూరిజం-యాన్ ఆపర్చునిటీ అన్ ట్యాప్డ్' పేరిట నంగియా ఆండర్సన్ ఎల్ఎల్పీ, ఫిక్సీ సంయుక్తంగా ఈ నివేదిక రూపొందించాయి. 

రాకపోకలతో కూడిన భారత పర్యాటక మార్కెట్, భారత పర్యాటకులు, ప్రయాణికులు తాము ఖర్చు చేసే డబ్బుకు తగిన సేవలు పొందడం తదితర అంశాలపై ఈ నివేదికలో సూత్రప్రాయంగా వివరించారు. ప్రముఖ పర్యాటక స్థలాలతో ప్రభుత్వం నేరుగా సంబంధాలు నెరపడం, విదేశీ విహార నౌకలను భారత సముద్ర జలాల్లోనూ అనుమతించడం వంటి అంశాలను కూడా ఈ నివేదికలో స్పృశించారు.

More Telugu News