YSRCP: వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ భేటీకి గోరంట్ల మాధ‌వ్ హాజ‌రైన ఫొటోను పోస్ట్ చేస్తూ మండిపడిన టీడీపీ

  • మ‌హిళ‌తో న‌గ్నంగా వీడియో కాల్ మాట్లాడినట్లుగా గోరంట్ల మాధ‌వ్‌ పై ఆరోపణలు
  • ప్రత్యేక కుర్చీ వేసి మరీ కూర్చోపెట్టారంటూ టీడీపీ విమర్శ 
  • సిగ్గు వాళ్ళకి లేదా ? మనకి లేదా ? అంటూ ప్రశ్న  
hindupur mp gorantla madhav attend ysrcpp meeting

ఈ రోజు ఢిల్లీలో జ‌రిగిన వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ భేటీకి హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌ హాజరవడంపై టీడీపీ మండిపడింది. 'దేశం సిగ్గు పడే పని చేసిన గోరంట్ల మాధవ్ ని సస్పెండ్ చేస్తున్నాం అని లీకులు ఇచ్చారు.. కట్ చేస్తే, ఈ రోజు ఢిల్లీలో పార్టీ సమావేశాలకు ప్రత్యేక కుర్చీ వేసి మరీ కూర్చోపెట్టారు. సిగ్గు వాళ్ళకి లేదా ? మనకి లేదా ?' అంటూ టీడీపీ ట్వీట్ చేసింది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి మాధవ్ హాజరైన ఫోటోను కూడా టీడీపీ పోస్ట్ చేసింది.

ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌ ఓ మ‌హిళ‌తో న‌గ్నంగా వీడియో కాల్ మాట్లాడిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు రావడం, దానిని ఆయన మార్ఫింగ్ వీడియో అంటూ ఖండించడం విదితమే.  

More Telugu News