చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ లో భాగస్వాములు కావద్దు: ఇతర దేశాలకు ఇండియా హెచ్చరిక

India Slams China Pak Move To Involve 3rd Nations In CPEC
  • సీపీఈసీలో ఇతర దేశాలను చైనా, పాక్ భాగస్వాములను చేసే ప్రయత్నం చేస్తున్నాయన్న భారత్
  • ఇది అంగీకారయోగ్యం కాదన్న ఇండియా
  • ఇది భారత సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమవుతుందని హెచ్చరిక
చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) ప్రాజెక్టులో ఇతర దేశాలను కూడా చైనా, పాకిస్థాన్ దేశాలు భాగస్వాములను చేసే ప్రయత్నం చేస్తున్నాయని భారత్ మండిపడింది. ఇది చట్ట విరుద్ధమని, అంగీకారయోగ్యం కాదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బగ్చి అన్నారు. 

ఈ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావడమంటే... భారత దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమే అవుతుందన్న విషయాన్ని ఆయా దేశాలు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఈ ప్రాజెక్ట్ పీఓకే గుండా వెళ్తున్న క్రమంలో దీనిపై తొలి నుంచీ కూడా భారత్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తపరుస్తోంది. పాక్ ఆక్రమించుకున్న తమ భూభాగంలో ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని విమర్శిస్తోంది.
Go Back to Shorts
India
China
Pakistan
CPEC
PoK

More Telugu News