OYO: నీట్ పరీక్ష రాసే అమ్మాయిలకు ఓయో స్పెషల్ ఆఫర్

  • ఈ నెల 17న నీట్
  • 60 శాతం రాయితీ ప్రకటించిన ఓయో
  • తమ హోటళ్లలో బస చేసే విద్యార్థినులకు ఆఫర్
OYO conveys special offer for NEET aspirants girl students

ఈ నెల 17న దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరగనుంది. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం జాతీయస్థాయిలో జరిగే ఈ పరీక్ష కోసం 18 లక్షల మందికి పైగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో, ఆతిథ్య సేవల సంస్థ ఓయో బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయితే ఇది అమ్మాయిలకే వర్తిస్తుంది. నీట్ పరీక్ష రాసే విద్యార్థినులకు తమ హోటళ్లలో 60 శాతం రాయితీ ఇస్తామని ఓయో వెల్లడించింది. ఈ ఆఫర్ జులై 16, 17 తేదీల్లోనే వర్తిస్తుందని వివరించింది. 

అయితే, ఈ రాయితీ పొందాలనుకునేవారు తొలుత తమ ఫోన్లలో ఓయో యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఆ యాప్ ను ఓపెన్ చేసి నియర్ బై ఐకాన్ క్లిక్ చేస్తే... సదరు విద్యార్థిని పరీక్ష రాసే కేంద్రానికి సమీపంలోని ఓయో హోటళ్ల జాబితా వస్తుంది. అందులో ఓ హోటల్ ను ఎంచుకుని కూపన్ కోడ్ ను ఎంటర్ చేస్తే రాయితీ వస్తుంది. బుకింగ్ బటన్ పై క్లిక్ చేయడం ద్వారా నగదు చెల్లింపు ప్రక్రియ పూర్తవుతుంది.

More Telugu News