ఏపీలో మునిసిపల్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి హైపవర్ కమిటీ ఏర్పాటు
- సమస్యల పరిష్కారం కోసం మునిసిపల్ ఉద్యోగుల నిరసనలు
- వేగంగా స్పందించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
- ముగ్గురు మంత్రులు, సీఎస్తో హైపవర్ కమిటీ ఏర్పాటు
- ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించిన కమిటీ
మునిసిపల్ కార్మికుల నిరసనలపై వేగంగా స్పందించిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం... తక్షణమే రంగంలోకి దిగిపోవాలని కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చర్చలకు రావాలంటూ మునిసిపల్ ఉద్యోగాల సంఘాల నేతలకు కమిటీ నుంచి ఆహ్వానం అందింది.