Corona Virus: దేశంలో కొత్తగా 16,678 కరోనా కేసులు.. 1.30 లక్షలు దాటిన యాక్టివ్ కేసులు!

India reports 16678 fresh cases
  • గత 24 గంటల్లో 26 మంది మృతి
  • దేశంలో పాజిటివిటీ రేటు 5.99 శాతం
  • నిన్న వ్యాక్సిన్ వేయించుకున్న వారి సంఖ్య 11,44,145

దేశంలో గత 24 గంటల్లో 16,678 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 14,629 మంది కోలుకోగా... 26 మంది మృతి చెందారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,30,713కి పెరిగింది. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,36,39,329కి పెరిగాయి. వీరిలో 4,29,83,162 మంది కోలుకున్నారు.

ఇక ఇప్పటి వరకు 5,25,454 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 5.99 శాతంగా, రికవరీ రేటు 98.50 శాతంగా, క్రియాశీల రేటు 0.30 శాతంగా, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 1,98,88,77,537 డోసుల కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 11,44,145 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. 


  • Loading...

More Telugu News