India: కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి.. కొత్తగా 17 వేలకు పైగా కేసుల నమోదు!

India reports 17092 fresh cases
  • గత 24 గంటల్లో 17,092 కేసుల నమోదు
  • కరోనా కారణంగా 29 మంది మృతి
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,09,568
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 17,092 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 14,684 మంది కరోనా నుంచి కోలుకోగా... 29 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,09,568కి పెరిగింది. తాజా కేసులతో కలిసి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,34,86,326కి పెరిగింది. వీరిలో 4,28,51,590 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,25,168 మంది మృతి చెందారు. 

ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 4.14 శాతంగా, క్రియాశీలక రేటు 0.25 శాతంగా, రికవరీ రేటు 98.54 శాతంగా, మరణాల రేటు 1.21 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 1,97,84,80,015 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 9,09,776 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. 


India
Corona Virus
Updates

More Telugu News